Search
  • Follow NativePlanet
Share
» »దేశంలోని ఈ ఆల‌యాల్లోని ప్ర‌సాదాల‌ను రుచిచూడాల్సిందే...

దేశంలోని ఈ ఆల‌యాల్లోని ప్ర‌సాదాల‌ను రుచిచూడాల్సిందే...

భార‌త‌దేశంలో ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాల‌కు కొద‌వే లేదు. ఇక్క‌డ ఆల‌యాల‌తో పాటు వాటిలో ఇచ్చే ప్ర‌సాదాలు కూడా ఎంతో ఫేమ‌స్‌. కొన్నిదేవాల‌యాల్లో కేవలం పంచ‌దార‌ను మాత్ర‌మే ప్ర‌సాదంగా ఇస్తారు. మ‌రికొన్ని ఆల‌యాల్లో ఎంతో రుచిక‌ర‌మైన ప్ర‌సాదాల‌ను ఇస్తారు. ఇక్క‌డి దేవాలయాల్లోని ప్రసాదాలు ఎంతో రుచిక‌రంగా ఉంటాయి. వాటి కీర్తి దేశ విదేశాలలో వ్యాపిస్తుంది. ఈ దేవాలయాలు వాటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత‌, వాస్తుశిల్పం ఇక్కడ సమర్పించబడిన సమర్పణల కారణంగా ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆక‌ర్షిస్తున్నాయి.

tirupatibalajitemple

తిరుమల తిరుపతి బాలాజీ ఆలయం

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో లడ్డూ ప్రసాదం ఎంతో ప్రసిద్ధి చెందింది. గత 308 సంవత్సరాలుగా ఆలయంలో లభ్యమవుతున్న ఈ లడ్డూ ప్రసాదం ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రధాన ఆకర్ష‌ణ అని చెప్పుకోవాలి. ప్రతి సంవత్సరం ఆలయ నిర్వాహకులు లడ్డూ ప్రసాదాలను ఇక్క‌డ లక్షల్లో విక్రయిస్తున్నారు. ఈ లడ్డూని శ్రీవారి లడ్డూ అని కూడా అంటారు. ఆలయానికి వచ్చే భక్తుడికి 300 గ్రాముల లడ్డూను ప్రసాదంగా ఇవ్వ‌డం జ‌రుగుతుంది. ఈ లడ్డూను త‌యారుచేసేందుకు అన్ని పదార్థాలను సరిగ్గా కొలిచిన పరిమాణంలో ఉపయోగిస్తారు.

goldentemple1

గోల్డెన్ టెంపుల్, అమృత్‌సర్

అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం ఎంతో ప్ర‌సిద్ధిచెందింది. ఇక్క‌డి ప్రశాంతమైన వాతావరణంతో సేద‌తీర‌డంతోపాటు ఆలయంలోని లంగర్ తినేందుకు చాలామంది భ‌క్తులు ఇక్క‌డికి వస్తుంటారు. ప్రతిరోజు సుమారు 50,000 మందికి ఇక్క‌డ ఆహారాన్ని తయారు చేసి అందిస్తారు. భారతదేశంలోని అతిపెద్ద వంటశాలలలో గోల్డెన్ టెంపుల్ ఒకటి. గోల్డెన్ టెంపుల్‌లో, ఆహారం ఎంతో రుచిక‌రంగా కూడా ఉంటుంది. చాలామంది భక్తులు ఇక్క‌డికి వ‌చ్చేవారు ఈ ప్ర‌సాదాన్ని ఎంతో భక్తి శ్ర‌ద్ధ‌ల‌తో తినేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు.

గురువాయూర్ దేవాలయం, కేరళ

దక్షిణ భారత దేవాలయాలలో కేవ‌లం ఒక్క ప్ర‌సాదాన్నే నైవేద్యంగా పెట్ట‌రు. అనేక ర‌కాల వంట‌కాల‌ను స్వామివార్ల‌కు నైవేద్యంగా పెడుతుంటారు. తర్వాత ఆ ప్ర‌సాదాల‌ను భక్తులకు పంచుతారు. కేరళలోని గురువాయూర్ ఆలయంలో స్వామికి ప్రత్యేకంగా సమర్పించే పాలపాయసం చాలా ప్రసిద్ధి చెందింది. బియ్యం, పాలు మరియు పంచదార కలిపి ఉత్తర భారత ఖీర్ లాగా తయారు చేయబడిన ఈ రుచికరమైన భోగ్‌ను ముందుగా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ త‌ర్వాత ప్ర‌సాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు. ఈ ఖీర్‌ను రుచి చూసేందుకు భ‌క్తులు పెద్ద క్యూలలో నిల‌వ‌బ‌డ‌తారు.

జగన్నాథ దేవాలయం, ఒడిశా

ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయంలో లభించే ప్రసాదాన్ని భ‌క్తులు మహాప్రసాదంగా భావిస్తారు. జగన్నాథ ఆలయంలోని మెగా కిచెన్‌లో 56 భోగ్‌లను వండి జగన్నాథుడు, బలభద్రుడు మరియు అతని ప్రియమైన సోదరి సుభద్రకు నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు. ఈ మహాప్రసాదం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ప్రతి ఆహారాన్ని ఆవిరితో మాత్రమే వండుతారు. జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు సుమారు 80 వేల మందికి అన్నం వండి పెడుతుంటారు. ఆలయంలో ప్రతి 50 క్వింటాళ్ల బియ్యం వండుతారు. భగవంతునికి సమర్పించే ఆహారంలో ఖిచ్డీ, పప్పులు, కూరగాయలు, స్వీట్లు ఉంటాయి.

siddhivinayaktemple

సిద్ధివినాయక దేవాలయం, ముంబై

ముంబైని సంద‌ర్శించే ప్ర‌తి ఒక్క ప‌ర్యాట‌కుడు ఇక్క‌డి సిద్ధివినాయక దేవాలయంలోని గణపతిని త‌ప్ప‌కుండా ద‌ర్శించుకుంటాడు. ఈ ఆలయంలో గణేశుడికి మోదకం ప్రసాదంగా సమర్పిస్తారు. ఇది బెల్లం, ఇతర తీపి పదార్థాలతో నింపిన బియ్యం పిండిని ఆవిరి చేయ‌డం ద్వారా త‌యారు చేస్తారు. ఇది ఒక‌ర‌క‌మైన ప్రత్యేకమైన స్వీట్. మహారాష్ట్రలోని ఇళ్లలో గణేషోత్సవం సందర్భంగా ఇది ప్రత్యేకంగా దేవునికి సమర్పించబడుతుంది. సిద్ధివినాయకుని ఆలయాన్ని సందర్శించే ప్రతి భక్తుడు ఖచ్చితంగా ఈ తీపి ప్రసాదాన్ని పొందుతాడు.

షిర్డీ సాయిబాబా ఆలయం, మహారాష్ట్ర

మ‌హారాష్ట్ర‌లోని షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సంద‌ర్శించేందుకు ప్ర‌తి ఒక్క‌రూ త‌ర‌లివ‌స్తుంటారు. ఈ ఆల‌యంలో ఉరి (పవిత్ర బూడిద) ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ప్రతి వ్యాధిని నయం చేసే ప్రత్యేకత దీనికి ఉందని ఇక్క‌డికి వ‌చ్చే వారి న‌మ్మ‌కం. అయితే గుడిలో లభించే ఆహారాన్ని రుచి చూసిన తర్వాత ప్రజలు తమ సమస్యలను, రోగాలను సగానికి సగం మర్చిపోతారు. ఇక్కడ పప్పు, చపాతీ, అన్నం, కూరగాయలు, స్వీట్లతో కూడిన ఆహారాన్ని ఉచితంగా పంపిణీ చేస్తారు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+