వెల్లూర్ ఫోర్ట్ వెల్లూర్ కు కేంద్రంగా ఉంది. ఇది పాత బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నది. భారతదేశం యొక్క ఆర్కియాలజికల్ సర్వే ఫోర్ట్ కు నిర్వహణకు సంబదించిన జాగ్రత్తలను తీసుకుంటుంది. వెల్లూర్ ఫోర్ట్ లో శ్రీ జలగందీస్వరార్ ఆలయం, ఒక మసీదు, చర్చి, ముతు మండపం, ప్రఖ్యాత వెల్లూర్ క్రిస్టియన్ హాస్పిటల్ మరియు రాష్ట్ర ప్రభుత్వం మ్యూజియం మొదలైనవి ఉన్నాయి. కోట బయటి గోడలు విస్తృతంగా త్రవ్విన కందకం చుట్టు భారీ గ్రానైట్ బ్లాక్లనుతో నిర్మించబడినది. సుర్యగుంట రిజర్వాయర్ ద్వారా ఈ కందకం నకు నీరు సరఫరా అవుతుంది,మరియు గోడలు డబుల్ గోడలతో నిర్మింపబడింది.
కోటలో టిప్పు మహల్ ఉంది. గ్రేట్ టిప్పు సుల్తాన్ బ్రిటిష్ యుద్ధ సమయంలో తన కుటుంబం తో ఇక్కడ నివసించారు అని చెబుతారు. బ్రిటీష్ పాలన సందర్భంగా, వెల్లూర్ ఫోర్ట్ లో కాండీ ఆఖరి రాజు,విక్రమా రాజసింహ మరియు టిప్పు సుల్తాన్ యొక్క కుటుంబ సభ్యులను రాజ ఖైదీలుగా ఉంచారు.1806 వ సంవత్సరములోని జరిగిన సిపాయిల తిరుగుబాటు మొదట వెల్లూర్ ఫోర్ట్ వద్ద జరిగింది. వెల్లూర్ ఫోర్ట్ ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఒక చారిత్రిక భవనం.