ఈ మందిరం కొండరాళ్ళతో నిర్మించారు. అందుకనే దీనికి కల్లు బసడి అని పేరు. కల్లు అనగా కన్నడ భాషలో రాయి అని అర్ధం. ఇక్కడగల విశాలమైన ప్రాంగణం కారణంగా దీనిని పెద్ద బసాడి లేదా దొడ్డ బసాడి అంటారు. కల్లు బసడి లో పర్యాటకులు 5 అడుగుల శాంతినాధ విగ్రహం చూడవచ్చు. యక్షి మహామానసి మరియు యక్షగరుడ రాతి నిర్మాణాలను కూడా విగ్రహానికి ఇరువైపులా చూడవచ్చు. ఇక్కడ ప్రధాన ఆకర్షణ అంటే తీర్ధంకర విగ్రహం పద్మాసనంలో ధ్యానముద్రలో ఉండటం. కల్లు బసడిలో చంద్రనాధ మరియు మహావీర తీర్ధంకురుల విగ్రహాలున్నాయి. క్రింది భాగంలో 24 కాంస్య విగ్రహాలు తీర్ధంకరులవి ఉంటాయి. ఈ భాగానికి హరి పీఠ అని కూడా పేరు. కల్లు బసడి ప్రవేశ భాగం వెలుపలివైపు స్లేట్ రాక్ తో నిర్మాణం చేశారు. ఇక్కడే సరస్వతి విగ్రహం మరియు పద్మావతి విగ్రహం కనపడతాయి. వీటి కారణంగా అమ్మనవార బసడి అని అంటారు.