పశ్చిమ చంపారన్ కి, నేపాల్ సరిహద్దులకి మధ్య సుమేశ్వర్ కొండల మీద చారిత్రిక సుమేశ్వర్ కోట వుంది. ఒక ఎత్తైన శిఖరం అంచున వున్న ఈ కోట ప్రస్తుతం శిధిలావస్థ లో వుంది. కానీ దీని అవశేషాలన్నీ చక్కగా వుండి పర్యాటకులకు ఆనందం కలిగిస్తాయి. హిమాలయాలలోని ధవళగిరి, గోసాయిథన్, గౌరీ శంకర్ శికరాలను ఇక్కడి నుంచి చక్కగా చూడవచ్చు – పైగా వీటిని చూడడానికి ఇదే ఉత్తమ ప్రదేశంగా కూడా భావిస్తారు.