బర్డ్ వాచింగ్ కి ప్రసిద్దమైన అటవీ ప్రాంతం ఈ సీతాబాణీ. పక్షులని తిలకిస్తూ పర్యాటకులు నడవగలిగే ఏకైక అటవీ ప్రాంతం ఇది. వాల్మీకి ఆలయం అలాగే నది ని పర్యాటకులు ఇక్కడ గమనించవచ్చు. వివిధ రకాలైన సరీసృపాలు ఈ నది ఒడ్డున కనిపిస్తాయి. పురాణాల ప్రకారం, సీతాదేవి(శ్రీరాముని భార్య) బహిష్కరణ సమయం లో కొన్ని రోజులు ఇక్కడే గడిపారు.
కార్బెట్ టైగర్ రిజర్వు వారి నిర్వహణలో ఈ ప్రాంతం లేదు. అర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యం లో ఈ ప్రాంతం ఉంది. పులులు, ఏనుగులు, డీర్స్, సాంబార్, బార్కింగ్ డీర్, పోర్సుపిన్స్ మరియు కింగ్ కోబ్రాస్ వంటి జంతువులకి స్థావరం ఈ ప్రాంతం. సీతాబాణీ ఫారెస్ట్ డిపార్టుమెంటు వారు ఈ ప్రాంతం లో ని ఏనుగుల సఫారీల ని ఏర్పాటు చేస్తారు.