సమయం దొరికితే కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయాన్ని సందర్శించే యాత్రికులు మత్స్య, పంచమీ తీర్థాలు కూడా చూసి తీరాలి. ఇక్కడి నీటిలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని ప్రతీతి.
కుమారధారా నది ఒడ్డున మత్స్య తీర్థం, నది కి దగ్గర లో పంచమీ తీర్థం వున్నాయి. పంచమీ తీర్థం బృందావన స్వాములకు చెందిన సుబ్రహ్మణ్య మఠం లో భాగం.
ఈ తీర్థాలకు దగ్గరలో సోమనాథ దేవాలయం, అగ్రహార సోమనాధ దేవాలయం, శ్రీ సుబ్రహ్మణ్య మఠానికి చెందిన పరమ పూజ్య శ్రీ వరాహతీర్థ స్వామి సమాధి వున్నాయి. పంచమి నాడు యాత్రికులు కుమారధారా నదిలో స్నానాలు ఆచరిస్తారు.