తిరుచిరాపల్లి జిల్లా భాగమైన శ్రీరంగం పట్టణంలో సమయపురం మరియమ్మన్ దేవాలయం వుంది. ప్రతిరోజూ వందలాది మంది భక్తులు సందర్శించే ఈ దేవాలయంలో ఆది, మంగళ, శుక్రవారాల్లో ప్రత్యెక పూజలు జరుగుతాయి కాబట్టి మరింత రద్దీగా వుంటుంది. భక్తులు అనేక రకాల నైవేద్యాలు తెస్తారు గానీ, బియ్యప్పిండి, నెయ్యి, పప్పు, బెల్లం వేసి తయారు చేసే ప్రత్యెక పదార్ధం ఇక్కడి ప్రధాన నైవేద్యం. మవిలక్కు మావు అని పిలువబడే ఈ ప్రసాదం దేవతలకు ఇష్టమైనదని చెప్తారు. ఇక్కడి ప్రజలు ఈ దేవాలయాన్ని ఒక తీర్థ యాత్రా స్థలంగా భావించడం వల్ల ఈ గుడికి చాలా ధార్మిక ప్రాధాన్యం వుంది. ఏప్రిల్, మే నెలల్లో ఇక్కడ ఒక రథోత్సవం కూడా జరుగుతుంది. ఫిబ్రవరి మార్చ్ నెలల్లో జరిగే పుష్పోత్సవం మరో ప్రధాన పండుగ. పుష్పోత్సవాన్ని పూచోరితల్ అని పిలుస్తారు.