ఇది కదం ప్రాజెక్ట్ గా బాగా ప్రాచుర్యం పొందినది. కదం ఆనకట్ట కద్దం నది పై నిర్మించారు. కదం నది గోదావరి నది యొక్క ఉప నది. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది. ఈ ఆనకట్ట ఆదిలాబాద్ పట్టణం నకు చాలా దగ్గరలో ఉంది మరియు గోదావరి ఉత్తర కెనాల్ ప్రాజెక్ట్ గా ప్రసిద్ధి చెందింది.
ఆనకట్ట నిర్మాణం 1949 సంవత్సరంలో ప్రారంభమై 1965 వ సంవత్సరంలో పూర్తి చేయబడింది. ఈ ఆనకట్ట ఆదిలాబాద్ జిల్లాలో 25,000 హెక్టార్ల భూమికి సేద్యానికి అందించే ఉద్దేశ్యంతో నిర్మించారు.
నేడు, ఈ ఆనకట్ట ఆదిలాబాద్ చుట్టూ ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. ప్రసిద్ధ విహారస్థలం మరియు కృత్రిమ పచ్చిక బయళ్ళు మరియు తాజా గాలి విశాలమైన, ఆకుపచ్చని చెట్లు సందర్శకులని బాగా ఆకర్షిస్తుంది. సికింద్రాబాద్ మరియు మన్మాడ్ మధ్య నడిచే మీటర్-గేజ్ రైలు కూడా ఆనకట్ట మీదుగా వెళ్తుంది.