హిస్టారికల్ మ్యూజియం మరియు రీసెర్చి కేంద్రం ఇక్కడి అహ్మద్ నగర్ పాలికచే నిర్వహించబడుతోంది. దీనిని 1960వ సంవత్సరంలో మహారాష్ట్ర దినోత్సవంనాడు స్ధాపించారు. ప్రారంభంలో రెండు గదులతో స్ధాపించబడిన ఈ సంస్ధ నేడు పెద్ద సైజు మ్యూజియంగా అభివృద్ధి చెందింది. ప్రసిద్ధి చెందిన వ్యక్తులైన శ్రీ సర్దార్ బాబాతాహెబ్ మిరికార్, శ్రీ మున్షీ అమ్మిద్, మరియు శ్రీ ఎన్.వి. పధక్ వంటివారు ఇక్కడ రీసెర్చి చేసి అనేక చారిత్రాత్మక గ్రంధాలను, కళా ఖండాలను భధ్రపరిచారు. ఇపుడు ఈ మ్యూజియంలో 12,000 గ్రంధాలు, 8,000 నాణేలు, 50,000 చారిత్రక పత్రాలు, మరియు కొన్ని కళా ఖండాలు ప్రదర్శించబడుతున్నాయి. లండన్ వారిచే గీయబడిన 1816 నాటి ఇండియా మ్యాపుమరియు 66 మీ. పొడవైన జాతకం ఈ ప్రదేశ ప్రధాన ఆకర్షణలలో కలవు. ఈ మ్యూజియాన్ని ఇటీవలే కలెక్టర్ కార్యాలయం సమీపంలోని హుతాత్మ చౌకు కు బదలాయించారు. ఈ ప్రదేశాన్ని టాక్సీ లేదా బస్ లో తేలికగా చేరవచ్చు. గురావారాలు తప్ప మిగిలిన వారాలలో ఉదయం 10 గం.లనుండి సాయంత్రం 5 గం. ల వరకు దీనిని దర్శించవచ్చు.



Click it and Unblock the Notifications