ఛత్రి తలావ్ అనేది అమరావతి నివాసులకు స్ధానికంగా త్రాగునీరుని అందించే ఒక రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ ను 1888 సంవత్సరంలో ఒక నీటి బుగ్గ కాళీ నది అనే దానిపై నిర్మించారు. ఇది మల్ఖేడ్ రైల్వే రోడ్డుపై దస్తూర్ నగర్ స్క్వేర్ నుండి 1 కి.మీ. దూరంలో ఉంటుంది. అయితే, అమరావతి ప్రజలు ప్రస్తుతం తాగు నీటిని ఎగువ వార్ధా డ్యామ్ నుండి పొందుతున్నారు. తలావ్ ప్రాంతంలో కల చిన్న తొట మరియు బోటింగ్ సౌకర్యాల కారణంగా పర్యాటకులు తలావ్ ను సందర్శిస్తున్నారు.