ఈ దేవాలయం మాత అంబాదేవి విగ్రహం కలిగి ఉంటుంది. అమరావతిలోని మధ్య భాగంలో గాంధీ స్క్వేర్ వద్ద కలదు. భీష్మకుడి కుమార్తె రుక్మిణిని ఆమెకు ఇష్టంలేని శిశుపాలుని వివాహం నుండి తప్పించి ఈ ఆలయంనుండి శ్రీక్రిష్ణుడు ఆమెను తీసుకు వెళ్ళి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. నవరాత్రి లేదా దసరా పండుగ వేడుకలలో వేలాది భక్తులు మాత అంబాదేవిని దర్శించుకుంటారు. పండుగ వేడుకలలో భాగంగా ఒక అతిపెద్ద సంత కూడా దేవాలయ ఆవరణలో జరుపుతారు.