దుర్గియనా టెంపుల్ లోహ గర్ గేటు సమీపంలో వుంది. ఈ టెంపుల్ లో మాత దుర్గ దేవి వుంటుంది. దీనినే లక్ష్మి నారాయణ టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ ను ప్రఖ్యాత గోల్డెన్ టెంపుల్ నమూనాలో హర్సాయి మాల్ కపూర్ 20 వ శతాబ్దంలో నిర్మించారు. అద్భుతమైన ఈ టెంపుల్ కు పునాది రాయి ప్రఖ్యాత రాజకీయ నేత, సంఘ సంస్కర్త పండిట్ మదన్ మోహన్ మాలవీయ వేశారు.
టెంపుల్ కాంప్లెక్స్ లో అనేక హిందూ దేవతల విగ్రహాలు వుంటాయి. అవి దుర్గ, సీతా మాత హనుమంతుడు మొదలైనవి. దుర్గ మాత అనేక అవతారాలను అనేక హిందూ సిద్ధాంతాలను గోడలపై వ్రాసారు. వెండి తలుపులు వుండటంచే దీనిని సిల్వర్ టెంపుల్ అని కూడా అంటారు. టవున్ కు వచ్చే సందర్శకులు దీనిని తప్పక చూడాలి.