గోవింద్ ఘర్ ఫోర్ట్ కు అసలు పేరు భంగియాన్ డా కిలా. అమ్రిత్సర్ లో తప్పక చూడవలసిన ప్రదేశం. గుజ్జర్ సింగ్ భంగి యొక్క సైన్యం ఈ కోటను నాలుగు బురుజులు, రెండు బలమైన గేట్లతో సున్నం, ఇటుకలతో 1760 లో నిర్మించింది. దీనిని మహారాజ రంజిత్ సింగ్ 1805 మరియు 1809 లలో పునర్ నిర్మించాడు. 1849 లో బ్రిటిష్ వారు దీనిని తీసుకుని దీనికి దర్బార్ హాల్, హవా మహల్ మరియు ఫాన్సీ ఘర్ జత చేసారు. జనరల్ డయ్యర్ యొక్క నివాసం ఫాన్సీ ఘర్ కు సరిగ్గా ఎదురుగా వుండేది. అతడు ఖైదీల శిక్షలను చూసి ఆనందించేవాడు. స్వాతంత్రం తర్వాత భారత సైన్యం 1948 లో ఈ కోటను వశ పరచుకొని పాకిస్తాన్ నుండి వచ్చిన వారికి పునరావాసం కల్పించింది. ఎన్నో చారిత్రక సంఘటనలకు సాక్ష్యం అయిన ఈ గురు గోవింద్ ఫోర్ట్ ను 2006 లో పంజాబ్ అప్పటి ముఖ్య మంత్రి కెప్టన్ అమరీందర్ సింగ్ ప్రజలకు తెరిచారు.