అమృత్సర్ హాల్ బజార్ లో మహాత్మా గాంధీ గేట్ సమీపంలో ఖైర్-ఉద్-దిన్ మసీదు ఉన్నది. భారతదేశం యొక్క స్వాతంత్ర్య ఉద్యమం యొక్క చరిత్రలో విపరీతమైన ప్రాముఖ్యం కలిగిన మందిరాలలో ప్రముఖమైనది. దీనిని 1876 వ సంవత్సరంలో మహమ్మద్ ఖైరుద్దీన్ నిర్మించారు. ఈ గొప్ప భవనం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా టూటీ ఇ హింద్,షా అత్తౌల్లహ్ బుఖారి ప్రకటించిన యుద్ధం యొక్క మహా పిలుపుకు గుర్తుగా ఉన్నది.
అసమానమైన భవన నిర్మాణం గాంభీర్యం వంటి ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నది. ఖైర్ -ఉద్-దిన్ మసీదు ముస్లింలకు అమృత్సర్ లో అత్యంత గౌరవించే మతపరమైన కేంద్రాలలో ఒకటిగా ఉంది. నమాజ్ సమయంలో ఈ మసీదు యొక్క పెద్ద ప్రాంగణంలో అల్లాహ్ ప్రార్థనలు చెయ్యాలనుకునే వందల మంది పురుషులతో నిండిపోయి ఉంటుంది. ఈ గంభీరమైన మసీదు యొక్క వ్యూహాత్మక స్థానం వలన ఒక ఆకర్షనీయమైన పర్యాటక ప్రదేశంగా ఉన్నది.