సైంతల, బలంగీర్ నుండి 35 కిలోమీటర్ల దూరంలోని పురావస్తు, చారిత్రిక ప్రాధాన్యత ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం మహిషాసురమర్దిని రూపంలో కొలువై ఉన్న చండి దేవత, చండేశ్వరి థాకురాణి మాతా ఆలయానికి ప్రసిద్ధి. ఈ ఆలయం సోమవంశి కాలానికి చెందినదిగా విశ్వసిస్తారు. ఈ ఆలయ ద్వారాన్ని విష్ణుదేవుని పది లేదా దశావతారాలు, గంగా, యమున చిత్రాలతో అలంకరించారు.
సైంతలలో అన్ని ముఖ్య పండుగలను ఎంతో వైభవంగా జరుపుకొంటారు. అవి రథ యాత్ర, సావిత్రి వ్రతం, దుర్గాపూజ, గజలక్ష్మి పూజ, దీపావళి, మకర సంక్రాంతి, హోలీ లేదా డోల పూర్ణిమ, మహామాస గురుపర్వం, రక్షా బంధన్, బిశుబ లేదా పన సంక్రాంతి, కార్తిక పూర్ణిమ, జన్మాష్టమి, నబన్న లేదా నఖాయి, గణేశుని పూజ భాయి జయంతి, పూవా జయంతి, రామ నవమి, సరస్వతి పూజ.
నవరాత్రి దుర్గాపూజ, సైంతలలో ప్రత్యేకమైంది. దీనిని తొమ్మిది రోజులు జరుపుకొంటారు. ఈ సమయంలో అష్టమి తిథి లేదా 8 వ రోజున భాయి జయంతిని జరుపుకొంటారు. ఈ పండుగ దినాలలో సైంతలను తప్పనిసరిగా సందర్శించ వలసినదిగా సూచించబడింది.