బలంగీర్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుజెంపాలి లో ఆనంద నికేతన్ ఉన్నందున దీనిని ఖుజెంపాలి ఆశ్రమం అని కూడా అంటారు.
ఈ ఆశ్రమాన్ని1985 లో పరమహంస స్వామి శ్రీ సత్యప్రజానంద సరస్వతి స్థాపించాడు. ఈ ఆశ్రమం 40 ఎకరాల భూమిలో ఉంది. దీని చుట్టూ విశ్వాత్మ విద్యామందిర్ పాఠశాల, అశుతోష్ పీఠం, సాధన కేహత్ర,, పూజ మండపం, యోగా కేంద్రం, ప్రజ్ఞ కుటీరం, శాంత నివాసం, తోటలు, పచ్చటి అడవులు ఉన్నాయి. ప్రపంచం నలుమూలల నుండి ప్రతి ఏటా అనేక మంది సందర్శకులు శాంతిని, దివ్యత్వాన్ని కనుగొనడానికి ఇక్కడకు వస్తారు.
సందర్శకులు యోగాను నేర్చుకొని, అభ్యసించడానికి కూడా ఇక్కడకు వస్తారు. నవరాత్రి, గురు పూర్ణిమ, శివ రాత్రి వంటి ఎన్నో పండగలను ఇక్కడ జరుపుకొంటారు. ఈ ఆశ్రమానికి ఒక సందర్శన ఎంతగానో సూచించబడింది.