బిలిగిరి రంగస్వామి దేవాలయాన్ని పర్యాటకులు తప్పక చూడాలి. ఇది కొండపై ఎంతో ఎత్తుగల ప్రదేశంలో ఉంటుంది. దీనిని వేంకటేశ్వరుడికి అంకితమిచ్చారు. ఇండియాలోని అన్ని దేవాలయాలలోకంటే కూడా ఇది విభిన్నంగా ఉంటుంది. ఈ దేవాలయంలోని రంగనాధుడు తన సహచరితో కలసి నిలబడి ఉంటాడు. రంగనాధుడి సహచరిణి రంగనాయకిని కూడా పూజిస్తారు. ప్రతి శుక్రవాలం ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ దేవాలయం వైష్ణవులకు ప్రసిద్ధి. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి స్ధానిక తెగల ప్రజలు రంగనాధుడికి ఒక అడుగు 9 అంగుళాలు ఉండే చర్మపు చెప్పులు కుట్టి ఇస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుండి ఇక్కడ జరిగే రధోత్సవ పండుగకు వేలాది ప్రజలు వస్తారు. ఇది వైశాఖ మాసం అంటే ఏప్రిలో నెలలో జరుగుతుంది.