శ్రీనగర్ కి సమీపంలో ఉన్న బుద్గం జిల్లాకి వాయుమార్గం, రైలుమార్గం మరియు రోడ్డు మార్గం వంటి ప్రధాన రవాణా మార్గాల ద్వారా సులువుగా చేరుకోవచ్చు. వాయు మార్గం : బుద్గం కి సమీపంలో ఉన్న విమానాశ్రయం శ్రీనగర్ విమానాశ్రయం. ప్రధానమైన భారతీయ పట్టణాలైన ముంబై, ఢిల్లీ, షిమ్లా మరియు చండిగర్హ్ వంటి పట్టణాలకి ఈ విమానాశ్రయం చక్కగా అనుసంధానమై ఉంది. శ్రీనగర్ నుండి 876 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏంతో మంది అంతర్జాతీయ పర్య్తకులని ఈ ప్రాంతానికి చేర్చడానికి తోడ్పడుతుంది.