చురచాన్ద్పూర్ జిల్లాలో, ఖుగా ఆనకట్ట, జిల్లా ప్రధాన జీవన రేఖలలో ఒకటి. ఇది విద్యుత్తు ఉత్పత్తి మరియు నీటి సరఫరా వంటి అనేక ప్రయోజనాల కోసం రూపొందించబడింది మరియు ఖుగా ఆనకట్ట కూడా ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉన్నది. ఖుగా ఆనకట్ట ఒక కృత్రిమ సరస్సు మీద నిర్మించబడింది మరియు దీనిని ప్రముఖంగా స్థానికులు పిక్నిక్ స్పాట్ గా ఉపయోగిస్తారు.
ఈ ఆనకట్ట 1983 లో ప్రారంభించారు, అయితే దీని పరిస్థితి తరువాతి సంవత్సరాలలో క్షీణించటం జరిగింది. అయితే, వివిధ ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగించుకోవడానికి 2002 సంవత్సరంలో పునరుద్ధరించబడింది. 2010 లో, సోనీయా గాంధీ పునరుద్ధరించబడిన ఆనకట్టను ప్రారంభించారు.
దీని నిర్మాణ అంచనా వ్యయం రూ.2.5 బిలియన్, ఆనకట్ట ఎత్తు 38 మీటర్లు.దీని వెడల్పు 230 మీటర్లు. ఇది 'మాతా' గ్రామ సమీపంలో ఉన్నది మరియు జిల్లా అభివృద్ధికి సహాయపడింది. ఈ ఆనకట్ట నిర్మాణం వలన చురచాన్ద్పూర్ యొక్క స్థాయి పునరుద్ధరించబడిందని ఒక నమ్మకం.