పాపనాశనం అంటే అర్థం 'పాపాలు నాశనం కావటం'. దరాసురం నుండి 10 కి. మీ. దూరంలో ఉన్న తంజావూర్ జిల్లాలో ఈ పట్టణం ఉన్నది. ఈ పట్టణం తంజావూర్ హెడ్ క్వార్టర్స్ కి 25 కి. మీ. దూరంలోను మరియు కుంబకోణం పట్టణానికి 15 కి. మీ. దూరంలోను ఉన్నది. ఇక్కడ ఉన్న పల్లైవనాథ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని చోళ రాజులు కట్టించారని చెపుతారు. ఈ పట్టణంలో నాయక్స్ చేత కట్టించబడిన పెద్ద ధాన్యాగారం ఉన్నది. ఈ ధాన్యాగారం చాల వెడల్పుగా ఉన్నది మరియు దీనికి 3000 కళంల సామర్థ్యం ఉంది. ఇది 36 అడుగుల ఎట్టు మరియ 86 అడుగుల వెడల్పు కలిగి ఉన్నది. దీనిని 1600 - 1634 ఏ.డి. ల మధ్యకాలంలో కట్టి ఉంటారని చెపుతారు. ఇది సున్నపురాయితో నిర్మించబడింది. ది ఆర్కిటెక్చరల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని ఒక హెరిటేజ్ స్మారక చిహ్నంగా గుర్తించారు.