ధర్మస్ధలలో బాహుబలి విగ్రహం తప్పక చూడవలసిన ఆకర్షణలలో ఒకటి. ఇది రత్నగిరి కొండపై ఉంది. ఈ విగ్రహం సుమారు 39 అడుగుల పొడవు ఉంది. దీనిని 1973 సంవత్సరంలో రంజనా గోపాల్ క్రిష్ణ షెనాయ్ రూపొందించారు. 1982 ఫిబ్రవరిలో ఈ విగ్రహాన్ని దేవాలయంలోపల వీరేంద్ర హెగ్డే ప్రతిష్ట చేయించారు. నిస్వార్ధానికి, త్యాగానికి ప్రతీకగా జైనులు ఈ విగ్రహాన్ని కొలుస్తారు. ప్రజలలో కల కధనం మేరకు బాహుబలి మరియు భరత (అతడి పెద్ద సోదరుడు) ఇరువురూ రాజకుమారులు. తమ ఆధిపత్యం కొరకు ఒకరితో మరి ఒకరు పోరాడుతారు. పోరాటంలో గెలిచిన బాహుబలి తన తమ్ముడిని క్షమించి వదిలేస్తాడు. ఇదే సమయంలో యుద్ధం, చంపుకొనటం వంటివి ప్రయోజనంలేనివిగా గుర్తిస్తాడు. వెంటనే తన రాజ్యాన్ని తమ్ముడు భరతుడికి అప్పగించి దిగంబర జైన మతంలో చేరతాడు. మోక్షానికి మార్గం కోరుతూ బాహుబలి తనకు దివ్యత్వం చేకూరే వరకు దిగంబరంగా ఉండిపోతాడు. ఈ ప్రదేశం చేరటానికి పర్యాటకులు రత్నగిరి కొండలు షుమారు 20 నిమిషాలపాటు మెట్లు ఎక్కాలి. కనుక పర్యాటకులు ఉదయం వేళ మాత్రమే ఈ ప్రదేశాన్ని చేరి ానందించాలని చెపుతారు. కొండపైన తాగునీరు వసతి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ప్రదేశం సందర్శించేవారు ఉదయం 8 గంటలనుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటలకు మాత్రమే అక్కడి విగ్రహ దర్శనం పొందగలరు.



Click it and Unblock the Notifications