హుమాయున్ మసీదును పేరుకు తగినట్టుగానే మొఘలు చక్రవర్తి హుమాయున్ నిర్మించాడు. కాని, తన తండ్రి బాబర్ వలె అతను బలమైన పాలకుడు కాదు. అతనిని షేర్ షా సూరి ఓడించాడు. అతను వెనకకు వస్తూ, ఆగిన ఒక ప్రాంతంలో ఫీరోజ్ షా తుఘ్లక్ దానిలోని ఒక రాతి స్తంభంతో ఒక కోటను నిర్మించాడు. హుమాయున్ ఈ ప్రాంతంలో శుక్రవారం ప్రార్ధనలు చేసేవాడు. అతనికి శ్రద్ధాంజలిగా తర్వాతి కాలంలో ఇక్కడ ఒక మసీదును నిర్మించాడు. మొఘలుల నిర్మాణ శైలిలో ఉన్న ఈ మసీదు నిర్మాణానికి 1526 నుండి 1556 మధ్య మూడు దశాబ్దాల కాలం పట్టింది. లఖురి ఇటుకలతో కట్టిన ఒక పెద్ద తెర పశ్చిమ దిక్కుకు తిరిగి ప్రార్ధనలను చేసుకోవడానికి నిర్మించారు.
ముస్లిముల పవిత్ర ప్రదేశం మక్కాలోని కాబా దిక్కును ప్రదర్శించే మెహ్రాబ్ అనే – ఒక గుమ్మటం కూడా ఉంది.
హుమాయున్ మసీదు ఒక ప్రసిద్ధ ఇస్లా౦ మందిరం. శుక్రవారాలలో భారీ సంఖ్యలో ముస్లిములు ప్రార్ధనలు చేయడానికి వస్తారు. ఇది అతి పెద్ద కట్టడం, ఒకేసారి వేలాదిమంది రావచ్చు.