జైన్ మందిరం, ఫెరోజెపూర్ నుండి షుమారు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీర లోని అందమైన ఆలయం. 23 వ తీర్ధంకరుడైన పార్స్వనాద్ కి అంకితం చేయబడిన ఈ ఆలయం 1980 లో నిర్మించబడింది. 1200 ఏళ్ల నాటి ఇత్తడి విగ్రహాలు ఉండడం ఈ ఆలయ ముఖ్య లక్షణం. గుజరాత్ లోని పాలిటన నుండి తెచ్చిన ఈ ఆలయ ప్రధాన విగ్రహం కూడా చాలా పురతనమైనదే. పర్యాటకులు ఈ ఆలయ గోడలపై చెక్కబడిన చిత్రాల ద్వారా జైన తీర్ధంకరుల జీవితాల గురించి తెలుసుకోవచ్చు. 3 అంతస్తులు గల ఈ ఆలయం, సందర్శనకు విలువగల ఆకర్షణ.