1897 యుద్ధానికి గుర్తుగా సరఘరీ స్మారక గురుద్వారా నిర్మించబడింది. దీన్ని వజీరిస్తాన్ లోని సరఘరీ కోటను పది వేల మంది ప� ాన్ లనుంచి రక్షిస్తూ ప్రాణాలు కోల్పోయిన 21 మంది ’36 సిఖ్ రెజిమెంట్’ సైనికుల గౌరవార్ధం నిర్మించారు. ఈ స్మారక గురుద్వారా చుట్టూ ఫిరంగులు వుండగా, దాని గోడల మీద ఈ 21 మంది వీర జవాన్ల పేర్లు చెక్కి వున్నాయి. ప్రతి ఏటా సెప్టెంబర్ 12 వ తేదీ ఉదయం ఇక్కడ ఒక ధార్మిక సమావేశం జరుగుతుంది, తరువాత సాయంత్రం పూట విశ్రాంత జవాన్ల సమావేశం జరుగుతుంది. ఆ రోజు ఇక్కడ వేలాది మంది ప్రజలు సమావేశమై అమర జవాన్లకు నివాళులు అర్పిస్తారు.