హర కి పురి అనేది ప్రసిద్ధ బ్రహ్మ కుండ్, చాలా పవిత్ర ప్రదేశం గా చెపుతారు. ఇక్కడ నుండి గంగా నది మైదానాలలోకి ప్రవేస్తుంది. ఈ ప్రదేశ నిర్మాణం విక్రమాదిత్య చే గంగా నది ఒడ్డున తపస్సు ఆచరించిన తన సోదరుడు బ్రితారి పేరు పై చేయబడింది.
ఈ ప్రదేశ పురాణ లమేరకు వేదం కాలం లో భగవంతుడు అయిన శివుడు మరియు విష్ణువు లు ఇక్కడ ప్రత్యక్షం అయేవారు. మరొక కధనం మేరకు బ్రహ్మ దేవుడు ఇక్కడ యజ్ఞం చేసాడు. ఇక్కడి ఘాట్ లో విష్ణు మూర్తి పాద ముద్రలు కూడా చూడవచ్చు. ఇక్కడి నది లో మునిగితే పాపాలు నశిస్తాయని చెపుతారు. భక్తులు అధిక సంఖ్య లో వచ్చి మత పర సిరో ముందనాలు, అస్తికల నిమజ్జనం వంటివి చేస్తారు. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక సారి కుంభ మేలా నిర్వహిస్తారు.