మానసా దేవి టెంపుల్ హరిద్వార్ నగరానికి సుమారు 3 కి. మీ. ల దూరంలో కలదు. ఈ టెంపుల్ మానస దేవి కి అంకితం చేయబడినది. ఈమె వేదకాలం నాటి మహా రుషి కాశ్యప రుషి మానసిక కుమార్తె. ఈ దేవత నాగుల రాజు అయిన నాగ వాసుకి భార్య. ఈ టెంపుల్ శివాలిక్ కొండలలోని బిల్వ పర్వతంపై కలదు. ఈ టెంపుల్ లో రెండు విగ్రహాలు కలవు. వాటి లో ఒక దానికి అయిదు చేతులు, మూడు నొరులు వుండగా, మరొకదానికి ఎనిమిది చేతులు వుంటాయి.
ఇండియా లోని 52 శక్తి పీఠాలలో ఒకటి అయిన ఈ సతి టెంపుల్ సిద్ధపీఠాల త్రిభుజం పై భాగాన కలదు. ఈ త్రిభుజంలో ముగ్గురు అమ్మలు అయిన, మాయా దేవి, చండి దేవి, మానస దేవి గుడులు కలవు. ఈ టెంపుల్ దర్శించే సమయంలో భక్తులు అక్కడ కల ఒక చెట్టుకు పవిత్ర దారాలు కట్టి తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటారు. కోరిక తీరగాని, చెట్టునుండి దారపు ముడిని తీసి వేస్తారు. టూరిస్టులు ఈ టెంపుల్ ను కేబుల్ కార్ లో చేరవచ్చు . ఈ కేబుల్ కార్ ను ' దేవి ఉడాన్ ఖటోల ' అంటారు .