ఉత్తరాఖండ్ లో ని నైనిటాల్ జిల్లాలో ఉన్న ఈ భీమ్టాల్ సముద్ర మట్టం నుండి 1370 అడుగుల ఎత్తులో ఉంది. చారిత్రక ఆధారాల ప్రకారం 1814 నుండి 1816 సంవత్సరాల మధ్యలో జరిగిన ఆంగ్లో-నేపాలీస్ యుద్ధం తరువాత ఈ ప్రాంతం బ్రిటిష్ పరిపాలనలో ఉండేది. పొరుగున ఉన్న నైనిటాల్ నగరం కంటే ప్రాచీనమైన ఈ భీమ్టాల్ నగరం లో ఇప్పటికి పురాతన పాదచారుల రహదారిని గమనించవచ్చు. ఈ రోడ్డు కత్గోడం, కుమోన్ హిల్స్, నేపాల్ మరియు టిబెట్ ల కి అనుసంధానమవుతుంది. ఒకప్పుడు ఈ భీమ్టాల్ ప్రసిద్దమైన ప్రాచీన సిల్క్ రూట్ లో భాగం అని అంటారు.
నైనిటాల్ జిల్లా యొక్క మినీ హెడ్ క్వార్టర్స్ అయిన ఈ ప్రాచీన నగరం పాండవులలో ఒకడైన భీముని(మహాభారతం లో ని పురాతన పాత్రలు) పేరుతో ప్రాచుర్యం పొందింది. పాండవుల రాజ్య బహిష్కార సమయంలో ఇక్కడికి భీముడు వచ్చినప్పుడు ఈ భీమేశ్వర ఆలయాన్ని నిర్మించబడినదని నమ్మకం.
భీమ్టాల్ లేక్ చివరన ఉన్న విక్టోరియా డ్యాం పర్యాటకులని ఆకర్షిస్తుంది. ఈ డ్యాం నుండి అధ్బుతమైన ప్రక్రుతి సౌందర్యం సందర్శకుల మనసులని దోచుకుంటుంది. భీమ్టాల్ లేక్ వద్ద ఉన్నద్వీపం లో ఉన్న అక్వేరియంని సందర్శకులు గమనించవచ్చు. ఔత్సాహికులకి బోటింగ్ సౌకర్యాలని అందించటం తో పాటు ఈ సరస్సు ఎన్నో ట్రాన్స్ హిమాలయన్ పక్షులని ఆకర్షిస్తుంది. ఇక్కడ నాగ దైవం అయిన కర్కోటక మహారాజా వారి మందిరం కర్కోటక నాగ టెంపుల్ ఉంది. రిషి పంచమి పర్వదినాన ఈ ఆలయానికి ఎంతో మంది భక్తులు తరలి వస్తారు. రాక్ ఆర్ట్స్, జానపద చిత్రలేఖనలు, పురాతన వస్తువులు మరియు ప్రాచీన రాత ప్రతులు మొదలగునవి ఇక్కడి ఫోక్ కల్చర్ మ్యూజియం లో ప్రదర్శింపబడతాయి. అంతే కాకుండా, దేవతలు మరియు దేవుళ్ళ వివిధ రకాల చిత్రాలని కూడా పర్యాటకులు ఈ మ్యూజియం లో గమనించవచ్చు.
భీమ్టాల్ నుండి 3 కిలోమీటర్ల దూరం లో ఉన్నసప్త నదుల సంగమం గా పేరుకొనే సట్టాల్ ని పర్యాటకులు సందర్శించవచ్చు. 500 స్థానిక మరియు వలస పక్షులకి, 11000 కిటకాలకి మరియు 525 రకాల సీతాకోక చిలుకలకి సట్టాల్ నివాసం. కిన్గ్ఫిషేర్స్, బ్రౌన్ హెడెడ్ బార్బెట్స్, బ్లూ విస్లింగ్ తృష్, ఇండియన్ ట్రీ పయ్స్ మరియు రెడ్ బిల్డ్ బ్లూ మాగ్పైస్ లు ఇక్కడ సాధారణంగా కనిపించే పక్షులు. వివిధ రకాల క్షీరధాలు ఇంకా సీతాకోకచిలుకలు ఇక్కడ కనిపిస్తాయి. హిడింబ పర్వతం ఈ సరస్సుకు దగ్గరలో ఉంది. ప్రసిద్దమైన ఇతిహాసం మహాభారత లోని పురాతన పాత్ర అయిన రాక్షసి హిడింబ పేరే ఈ పర్వతానికి వచ్చిందని అంటారు. ప్రస్తుతం ప్రముఖ గురువు అలాగే పర్యావరణవేత్త అయిన వంఖండి మహారాజ్ ఈ పర్వతం పై నివాసం ఉంటున్నారు. ఈ పర్వతం చుట్టూ అతను ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ ని ఏర్పాటు చేసారు. ఇప్పుడు ఈ ఏరియా వంఖండి ఆశ్రమం గా ప్రసిద్ది చెందింది.
వాయు, రోడ్డు మరియు రైలు మార్గం ద్వారా పర్యాటకులు ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఈ ప్రాంతానికి సమీపం లో ఉన్న విమానాశ్రయం పంత్నగర్ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం న్యూ ఢిల్లీ లో ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెగ్యులర్ ఫ్లైట్స్ ద్వారా చక్కగా అనుసంధనమై ఉంది. కత్గోడం రైల్వే స్టేషన్ నుండి రైళ్ళ సదుపాయం కూడా ఉంది. భీమటాల్ నుండి 21 కిలోమీటర్ల దూరం లో ఈ రైల్వే స్టేషన్ ఉంది. ఈ ప్రాంతానికి చేరుకునేందుకు సులభతరమైన మార్గం బస్సు మార్గం. నైనిటాల్, డెహ్రాడున్, హరిద్వార్, రుద్రప్రయాగ్, కౌసాని, రానిఖేట్ మరియు ఉత్తరకాశీ వంటి ప్రఖ్యాతి చెందిన పర్యాటక ప్రదేశాలు బస్సు సర్వీస్ ల ని అందిస్తున్నాయి. ముస్సోరీ, రుద్రప్రయాగ్, కౌసాని, రానిఖేట్ మరియు ఉత్తరకాశీ నుండి పర్యాటకులకు బస్సు సర్విస్ లు అందుబాటులో ఉంటాయి. లక్జ రియస్ బస్సుల ద్వారా ఢిల్లీ పట్టణం భీమ్టాల్ కి చక్కగా అనుసంధానమై ఉంది.
ఈ ప్రాంతం సంవత్సరం మొత్తం ఉప ఉష్ణమండల వాతావరణం తో ఉంటుంది. ఎండాకాలం, వర్షాకాలం అలాగే శీతాకాలం లు ఇక్కడ గమనించవచ్చు. ఎండాకాలం లో ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది. వర్షాకాలం లో భీమ్టాల్ లో భారీ వర్షపాతం నమోదవుతుంది. వణికించే చలికాలం నవంబర్ లో ప్రారంభమై ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఇక్కడ నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రత -3 డిగ్రీల సెల్సియస్. అందువల్ల భీమ్టాల్ కి పర్యటనకి ప్లాన్ చేసుకునే పర్యాటకులు ఎండాకాలం ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.