భారత్ మాత మందిర్ ను ప్రధానంగా మదర్ ఇండియా టెంపుల్ అని కూడా అంటారు. ఇది హరిద్వార్ లో ప్రసిద్ధ మతపర ప్రదేశం. ఈ టెంపుల్ లో భారత్ మాత ఉంటుది. దీనిని మత గురువు స్వామి సత్యమిత్రానంద్ గిరి కట్టించారు. భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఈ టెంపుల్ ను 1983 లో ఆవిష్కరించారు. ఎనిమిది అంతస్తులు కల ఈ టెంపుల్ 180 అడుగుల ఎత్తులో కలదు.
ప్రతి అంతస్తు లోని వివిధ హిందూ దేవతలు మరియు స్వాతంత్ర పోరాట యెద్దుల విగ్రహాలు కలవు. అన్నింటి లోకి మొదటి అంతస్తు లని భారత్ మాత విగ్రహం అందంగా వుంటుంది. రెండవ అంతస్తు లో శూరుల మందిరం కలదు. భారత దేశ స్వాతంత్రం కొరకు పోరాడిన యోధుల విగ్రహాలు ఇక్కడ వుంటాయి. మూడవ ఫ్లోర్ లో భారత దేశానికి సేవలు అందించిన గొప్ప మహిళల మాతృ మందిరం కలదు. నాల్గవ ఫ్లోర్ లో భారతీయ గొప్ప ఋషులు, అయిదవ ఫ్లోర్ లో మతాలు, చరిత్ర, భారత దేశ వివిధ అందమైన ప్రదేశాలు చూపబడతాయి. ఆరు మరియు ఎదవ ఫ్లోర్ ల లో మాత శక్తి మరియు లార్డ్ విష్ణు అవతారాలు ప్రదర్శించారు. ఎనిమిదవ ఫ్లోర్ ప్రకృతి ప్రియులకు మరియు ఆధ్యాత్మిక అభిలాషులకు ఆసక్తి కలిగించే లార్డ్ శివ మరియు హిమాలయాలు, హరిద్వార్ , సప్త సరోవరాల చిత్రాలు వుంటాయి.