ఢిల్లీతో సరిహద్దు కల ఘజియాబాద్ ఉత్తర ప్రదేశ్ కు ప్రవేశ ద్వారం. చక్కటి ప్రణాళికా బద్ధతకల ఈ నగరానికి మొగల్ మినిస్టర్ కుమారుడు, దీని వ్యవస్థాపకుడు అయిన ఘజియుద్దిన్ తన పేరుతో ఘజియ ఉద్దిన్ నగర్ గా పేరు పెట్టాడు. కాలానుగునంగా ఆ పేరు ఘజియాబాద్ గా మార్పు చెందినది.
హిందోన్ రివర్ కు 1.5 కి.మీ.లు దూరంలో తూర్పుగాగల ఈ నగరంలో అనేక పరిశ్రమలు వెలిశాయి. వాటిలో లోకోమోటివ్ మైన్తెనన్స్ అండ్ తయారీ, డిఫెన్సు పరిశ్రమలు, గ్లాస్ వారే తపెస్తారి, పోత్తరి, పెయింట్ , వార్నిష్ వంటివి ప్రసిద్ధి చెందినవి. ఢిల్లీ నగరానికి సమీపం అవటం వలన ఇక్కడ అనేక పెద్ద పెద్ద మాల్స్, షాపింగ్ సెంటర్ లు అతి త్వరగా ఏర్పడుతున్నాయి. ఈ సిటీ పేరు తోనే ఒక జిల్లా ఏర్పరచారు.
ఘజియాబాద్ లోను, చుట్టుపట్ల కల పర్యాటక ఆకర్షణలు
షాపులు, మల్టి ప్లేక్స్ లు మాత్రమే కాక ఇక్కడ సందర్శనకు అనేక ప్రదేశాలు కలవు.
వాటిలో ఒకటి అయిజారా గ్రామం. ఈ ప్రదేశం నుండి టేబుల్ ప్లేయింగ్ అనేది మొదలైంది. దశ్న మరొక అందమైన గ్రామం.ఇక్కడ ఒక కోట కలదు. సతి మాలినది దేవి టెంపుల్ కల దౌలన మరొక గ్రామం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక ఉత్సవం జరుగుతుంది. మొగల్ చక్రవర్తి అక్బర్ కనుగొన్న ఫరీద్ నగర్ పెద్ద పెద్ద గేటుల తో వుండి 'గర్హి బల్లోచన్' కు ప్రసిద్ధి గాంచినది. సమీపం లో ఒక జామా మసీదు కూడా కలదు. ఘర్ ముక్తేస్వర్ గా చెప్పబడే హాపూర్ ప్రతి సంవత్సరం అనేక మంది యాత్రికులను ఆకర్షిస్తుంది. హనుమాన్ టెంపుల్ కు ప్రసిద్ధి చెందిన లోని గ్రామాన్ని కూడా మీరు సందర్శించవచ్చు. ఇక్కడే రుషి పరశురాముడు జన్మించిన జలాలాబాద్ కూడా కలదు. ఇక్కడే మరొక ఆసక్తి కలిగించే ప్రదేశం మోడీ నగర్. ఈ ప్రాంతం ఇండియా లోని ప్రసిద్ధ పారిశ్రామిక వేత్త మోడీ పేరు పై ఏర్పడింది. మరొక ప్రాంతం మోహన్ నగర్. ఇది అనేక స్కూళ్ళ తో కాలేజ్ ల తో అభివృద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడ ఇండియన్ ఆర్మీకి అవసరమైన ఉత్పత్తులు కూడా తయారవుతాయి. చివరగా పెర్కొనదగిన ప్రాంతం దాద్రి. ఇక్కడ టెక్నాలజీ, అనేక ఇతర వసతులు ఏర్పడ్డాయి.
ఘజియాబాద్ సందర్శనకు మంచి సమయం
ఢిల్లీ కి సమీపం కనుక , ఢిల్లీ లోని వాతావరణమే ఇక్కడ వుంటుంది. రాజస్థాన్ నుండి దుమ్ము తుఫానులు, హిమాలయాలు, ఘర్ వాల్ హిల్స్ నుండి వచ్చే మంచు గాలులు ఇక్కడి క్లైమేట్ ను ప్రభావితం చేస్తాయి. వాతావరణం ఆహ్లాదంగా వుండే నవంబర్ నుండి ఏప్రిల్ వరకూ గల కాలం ఘజియాబాద్ సందర్శనకు అనుకూలమైనది.