మోహన్ నగర్ ఘజియాబాద్ లో ఒక తాలుకా. దీనిని పారిశ్రామిక వేత్త ఎన్.ఎన్.మోహన్ 1958 లో స్థాపించారు. కనుక ఆయన పేరు పెట్టారు. ఇది ఘజియాబాద్ నుండి గ్రాండ్ ట్రంక్ రోడ్ లో 7 కి.మీ. ల దూరంలోను, సాహిబా బాద్ నుండి 3 కి.మీ.ల దూరం లోను, ఢిల్లీ నుండి 16 కి.మీ.ల దూరం లోను వుంటుంది.
ధనికవంతమైన ఈ పారిశ్రామిక పట్టణం అక్కడ కల ఈస్ట్ మరియు మాల్ట్ ఫ్యాక్టరీ మరియు డిస్టిలరీ కి పేరుగాంచింది. ఒక పెద్ద కోల్డ్ స్టోరేజ్ ఐస్ ఫ్యాక్టరీ , కూల్ డ్రింక్ ల ఫాక్టరీ కలవు. మోహన్ నగర్ లో ఇంకా ఇంకా ఇతర పరిశ్రమలు కూడా కలవు. ఇక్కడే ఒక దేవాలయం కూడా కలదు.