రాజాజీ మెమోరియల్ హోసూర్ సమీపంలో కలదు. ఈ స్మారకాన్ని చక్రవర్హి రాజగోపాలాచారి గౌరవార్ధం తోరపల్లి లో నిర్మించారు. ఈయన మొట్ట మొదటి మరియు చివర ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పదవి నిర్వహించారు. రాజగోపాలచారి తోరపల్లి లో జన్మించారు. ఇప్పటికి ఇక్కడ ఆయన గౌరవింప బడతారు. ఈ మెమోరియల్ లో ఒక లైబ్రరీ, ఆయన ఫోటోలతో ఒక ఫోటో గేలరీ మరియు చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహం వుంటాయి. రాజాజీ మెమోరియల్ చేరాలంటే, హోసూర్ నుండి జాతీయ రహదారి 7 ద్వారా ప్రయాణించాలి. పెరండపల్లి వద్ద కుడివైపు కు తిరిగి తోరపల్లి వెల్కమ్ ప్రవేశ ద్వారం చేరవచ్చు. ఇక్కడ నుండి నేరుగా 3 కి. మీ. లు ప్రయాణిస్తే, రాజాజీ మెమోరియల్ చేరవచ్చు.