నర్షియంగ్, జయంతియా రాజుల ఒకప్పటి వేసవి రాజధాని, నేడు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు, పర్యాటకులు ఈ ప్రాంత పురాతన సంస్కృతి, ధార్మికతకు ప్రతీకగా ఉన్న సాక్షాల సందర్శనకు ఇక్కడికి వస్తున్నారు.
నర్షియంగ్ వద్ద ఉన్న దుర్గా ఆలయం ఈ సామ్రాజ్య హిందూ వారసత్వానికి నిర్ధారణగా నిలబడి ఉంది. ఈ ఆలయ అసలు నిర్మాణం పునరుధ్ధరించబడింది, కానీ ఇప్పటికీ దేవతలు బలిని ఇవ్వడానికి వాడిన శతాబ్దాల క్రిందటి విగ్రహాలు, బలిపీఠం, కత్తులు అక్కడ చూడవచ్చు.
అక్కడ శివాలయం కూడా ఉంది. నర్షియంగ్ మార్కెట్ కి, రాలియంగ్ మార్కెట్ నుండి నర్షియంగ్ మార్కెట్ కి ఒక పెద్ద ఫలకాన్ని తీసుకువచ్చిన ఉ మర్ ఫలింగ్కి అనే వ్యక్తితో ముడిపడిన ఒక పురాణం ఉంది. నేడు, నర్షియంగ్ వద్ద ఉన్న అదే ప్రదేశంలో, ఏకశిలల అతిపెద్ద సమూహాన్ని ఒకపక్కగా నిలబడి ఉండడం చూడవచ్చు. పర్యాటకులు, చిన్న గడ్డితో కప్పబడిన నిర్మాణాల కింద కూర్చుని పండ్లు, కూరలు, స్థానిక వంటకాలు, వెదురు బుట్టలు అమ్మే గిరిజన మహిళలు, పురుషులను చూసి ఈ మార్కెట్ ని సందర్శించడానికి ఇష్టపడతారు.
నర్షియంగ్ కి వెళ్ళే మార్గంలో, అందమైన తడ్లస్కీన్ సరస్సు ఉంది. ప్రశాంతమైన సాయంత్రాలలో ఈ సరస్సులో బోటింగ్ చేస్తూ, ఆహ్లాదకరమైన గాలి మీ ముఖాన్ని తాకుతూ ఉంటే సంతోషకరమైన అనుభూతి కలుగుతుంది. షిల్లోంగ్ నుండి యాత్రా కాబ్ బుక్ చేసుకుని నర్షియంగ్ చేరడం సరైన మార్గం.



Click it and Unblock the Notifications