శ్రీ కన్నప్ప దేవాలయం, ఇది శ్రీకాళహస్తిలోని ఒక చిన్న కొండ మీద ఉన్నది మరియు ఈ ఆలయానికి ఆసక్తికరమైన చరిత్ర ఉన్నది. శ్రీకాళహస్తిలోని ఈ ఆలయం శివ భక్తుడు అయిన భక్త కన్నప్పకు అంకితం చేయబడింది. ఆతను మహాభారతంలోని పాండవులలో ఒకడైన శివభక్తుడు అయిన అర్జునుని అవతారమని నమ్ముతారు. ఒక గిరిజన యువకుడు, కన్నప్ప నామధేయంగలవాడు ఆకులు మరియు దుమ్ముతో కప్పబడి ఉన్న శివలింగాన్ని కనుగొన్న తరువాత, శివునికి గొప్ప భక్తుడు అయ్యాడు. చాలా పవిత్ర నియమాలు వ్యతిరేకంగా సమీపంలోని జలధార నుండి తన నోటిలో నీరు తీసుకువొచ్చి, శివలింగాన్ని శుభ్రం చేశాడు మరియు పందిని చంపి, దాని మాంసాన్ని దేవునికి నైవేద్యం పెట్టాడు. ఒక పూజారి కన్నప్పకు శివుని మీద ఉన్న భక్తిని సవాలు చేశాడు మరియు అందరి భక్తులకన్నా కన్నప్ప భక్తి ఆధిక్యతను నిరూపించుకోమన్నాడు మరియు శివుడు కన్నప్పను పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు.
శివలింగ కన్ను నుండి రక్తధార స్రవించేట్లుగా చేశాడు. కన్నప్ప ఆ రక్తదారను ఆపాలని ప్రయత్నించాడు, కాని సాధ్యపడలేదు. కన్నప్ప వెంటనే తన నేత్రాన్ని తీసి రక్తం కారుతున్న నేత్రం స్థానంలో ఉంచాడు మరియు వెంటనే రక్తం కారటం ఆగిపోయింది. శివుడు ప్రత్యక్షమై, తనతోపాటుగా కన్నప్ప కూడా పూజలు అందుకునేలా వరం ఇచ్చాడు. ఈ దేవాలయం పురాణ స్థలంగా ప్రసిద్ధి చెందింది మరియు సంవత్సరమంతా దేశం నలుమూలలనుండి భక్తులు ఇక్కడికి వొస్తుంటారు.



Click it and Unblock the Notifications