హిరియంగడి, కర్కల సమీపంలో ఉన్న మరొక ప్రఖ్యాత ఆకర్షణ. సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య వున్న నేమినాథ్ బసది వల్ల ఈ ప్రదేశం ప్రసిద్ధికి ఎక్కింది. హిరియంగడి సందర్శించే ప్రయాణీకులు అక్కడ ఉన్న జైన పూజారుల సమాధులు, శిల్పాల నిర్మాణాలను చూడవచ్చు, కాంతవర ఆలయం, గౌరీ ఆలయం ఇక్కడికి దగ్గరలో ఉన్నాయి. కర్కల మత సామరస్యాన్ని గురించి తెలుసుకోవాలి అనుకునే వారికీ ఇది సరైన ప్రదేశం.
నేమినాథ్ బసది సందర్శించిన తరువాత, పర్యాటకులు చంద్రనాధ్ స్వామి విగ్రహం, భుజబలి బ్రహ్మచర్య ఆశ్రమం, అనంతనాద్ విగ్రహం, పద్మావతి బసదిలు, మహావీర్ దేవుని విగ్రహం, ఆదినాధ్ స్వామి విగ్రహన్ని చూడగలరు. అంతేకాక, 60 అడుగుల ఎత్తు కలిగిన మనస్తంభం కూడా ఇక్కడ ప్రసిద్ది చెందింది.