పర్వత కోట కేస్రోలిలో కల పర్వత కోట 14వ శతాబ్దానికి చెందినదిగా చెపుతారు. ఇపుడు దానిని ఒక హెరిటేజ్ హోటల్ గా నిర్వహిస్తున్నారు. ఈ కోట ఒక కొండమీద ఉంటుంది. ఇక్కడినుండి గ్రామం మరియు కొన్ని వ్యవసాయ భూములు చూడవచ్చు. శ్రీ క్రిష్ణుడి యదు వంశస్ధులైన రాజపుత్రులుసుమారు ఆరు శతాబ్దాల క్రిందట దీనిని నిర్మించినట్లు చెపుతారు. ఈ కోటను శత్రువుల నుండి రక్షణ కొరకు నిర్మించారు. కాలం గిచే కొద్ది ఈ కోట వివిధ పాలకుల చేతులలోకి మారింది. చివరకు దానిని మొగలాయిలు జయించారు. వారి తర్వాత జాట్లు చిట్ట చివరకు 1775 లో ఆల్వార్ పట్టణ స్ధాపన సమయంలో రాజపుట్ లు దీనిని వశం చేసుకొని పాలించారు. అనేక రాజవంశాలను చూసిన ఈ కోట ఎన్నో మార్లు అభివృధ్ధి చెందటం, విధ్వంసం కావటం జరిగింది. ఇపుడది నీమ్ రాణా హెరిటేజ్ కంపెనీ పేరుపై వింగ్ కమాండర్ మంగళ్ సింగ్ కు లీజుకు ఇవ్వబడింది. తర్వాత దీనిని హెరిటేజ్ హోటల్ గా మార్పు చేశారు ఎన్నో అట్టహాసాలు కల ఈ కోట ఇండియాలోని హెరిటేజ్ హోటళ్ళలో ఉత్తమమైనదిగా చెప్పబడుతుంది.