కేస్రోలి రాజస్ధాన్ లోని అల్వార్ జిల్లాలో ఒక చిన్న గ్రామం. ఇది ఢిల్లీ నగరానికి 155 కి.మీ.ల దూరంలో ఢిల్లీ - జైపూర్ జాతీయ రహదారిలో కలదు. ఇక్కడ 14వ శతాబ్దానికి చెందిన ఒక కోట కలదు. ఇపుడది ఒక హెరిటేజ్ హోటల్ గా మార్పు చేయబడింది.
కేస్రోలి పుట్టు పూర్వోత్తరాలు చెప్పాలంటే, అది మహాభారత కాలంనాటి మత్స్య కారులదని చెపుతారు. కేస్రోలి పర్వత కోట లమాత్రమే కాక, పర్యాటకులు ఇక్కడ విరాట్ రనగర్ లోని బౌద్ధ విహారాన్ని కూడా చూడవచ్చు. ఈ విహార ప్రదేశంలోనే పాండవులు తమ అజ్ఞాతవాసంలోని చివరి సంవత్సరం గడిపినట్లు చెపుతారు.
కేస్రోలి గురించి ఏమి తెలుసుకోవాలి?
కేస్రోలి గ్రామంలో పర్వత కోట మాత్రమే కాక పర్యాటకులు మెచ్చే అందమైన పచ్చటి ప్రదేశాలు కూడా కలవు. ఢిల్లీ నగరానికి మరియు అల్వార్ పట్టణానికి ఇది దగ్గరగా ఉండటంతో వారాంతపు సెలవుల ప్రదేశంగా ప్రనసిద్ధి చెందింది. కేస్రోలి జంతు శాస్త్ర అధ్యయనకారులకు,, పక్షి శాస్త్రవేత్తలకు కూడా ఆసక్తి కర ప్రదేశం. కేస్రోలి చేరటం ఎలా?
కేస్రోలి కి విమానం లేదా రైలు లేదా రోడ్డు మార్గాలలో చేరవచ్చు. కేస్రోలికి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపం లేదా అల్వార్ రైలు స్టేషన్ నుండి చేరవచ్చు. ఈ గ్రామం ఢిల్లీ - జైపూర్ జాతీయ రహదారిలో ఉండటంచే రోడ్డు ప్రయాణం కూడా అనుకూలమే. కేస్రోలి ఎపుడు దర్శించాలి?
కేస్రోలి సందర్శనకు అక్టోబర్ నుండి మార్చి నెలలు అనుకూల వాతావరణం. చల్లగా ఉండి ఆహ్లాదంగా ఉంటుంది. విమానం, రైలు, రోడ్డు మార్గాలలో కేస్రోలి చేరవచ్చు.