వడ్తల్ గ్రామంలో వున్న ఈ సరస్సు ఖేడా లోని పర్యాటక ఆకర్షణ. పురాణాల ప్రకార౦ కృష్ణుడితో కలిసి ప్రయాణించేటప్పుడు భీమసేనుడు ఇక్కడ ఒక చిన్న కొలను నీటిని పెద్ద సరస్సుగా మలిచి అడవి జంతువులకు, అక్కడి గ్రామస్థులకు మేలు చేశాడు. ఈ సరస్సు డకోరా దేవాలయం ఎదురుగా వుండి ద్వారకలోని గోమతి నది పేరిట ఏర్పడింది. గోమతి సరస్సు ఒడ్డున 230 హెక్టార్ల విస్తీర్ణంలో యాత్రికుల కోసం వసతి సౌకర్యాలు వున్నాయి. మఖానీ ఆరో, కాళేశ్వర్ మహాదేవ, భట్టిజీ మహారాజ్, డంకనాద్ మహాదేవ అనే నాలుగు ముఖ్యమైన గట్లు ఇక్కడ వున్నాయి. అటు పవిత్ర క్షేత్రంగానూ, ఇటు బోటింగ్ కు, తాబేళ్ళకు మేత వేయడానికి కూడా ఇది ప్రసిద్ది చెందింది.
డకోర్ లోని వివిధ దేవాలయాలు (శాంతారాం మందిరం, లక్ష్మీ దేవి గుడి, శ్రీ సత్యనారాయణ దేవాలయం, పునితాశ్రం, గాయత్రి దేవి గుడి, మహాప్రభుజీ నీ భేఠక్) : డకోర్ లో ఎన్నో గుళ్ళు వున్నాయి, ఎన్నంటే దీన్ని గుళ్ళ నగరం గా కూడా పిలువవచ్చు. డకోర్ లో చూడదగ్గ ఆసక్తికరమైన దేవాలయాల్లో కొన్ని : శాంతారాం మందిరం, లక్ష్మీ దేవి కోసం నిర్మించిన పెద్ద అందమైన గుడి.