మహేశ్వర్ దేవాలయం, ఇది బాగా ప్రాచుర్యంలో ఉన్న ఒక మత కేంద్రం. ఇది కన్నూర్ జిల్లాలో 'సుంగ్ర'లో ఉన్నది. ఈ దేవాలయం ఎటు చూసినా అత్యత్భుతమైన చెక్క పలకాలతో ఉన్నది. ఈ ఆలయ ప్రాంగణం మరియు ఇతర ఫలకాలు అద్భుతంగా మలచబడ్డాయి మరియు గడచిన శకంలోనివారి కళాత్మక సృష్టికి ఇది నిదర్శనం. ఇక్కడ వివిధ హిందూ మత దేవుళ్ళ ప్రతిమలు పురావస్తు శాఖలో ఉన్న వ్యక్తులకు చాలా పరిశోధత్మకంగా ఉంటాయి. ఈ దేవాలయపు తూర్పు గోడ మీద ఉన్న హిందూ దేవుడు, విష్ణు అవతారాలు మరియు రాశుల గుర్తులు ఉన్నాయి. ఈ ఆలయ పైకప్పు యొక్క దిగువ కోనలో ఉన్న గోడలు కూడా తన్మయులను చేస్తున్నాయి. ఆలయం తలుపు సమీపంలో 8వ శతాబ్దం నాటి ఒక పురాతనమైన రాతి స్తూపం ఉన్నది.
జానపద కథనం ప్రకారం, పరమేశ్వరుడు అయిన సుంగ్ర మహేశ్వరుడిఫై మహాభారతంలోని ఒక పురాణ పాత్ర అయిన 'భీమ' దాడి చేసాడు. సాట్లుజ్ నది మీద ఉన్న పర్వతం నుండి ఒక భారి రాతిబండను 'భీముడు' ఈ ఆలయం మీదకు విసిరేశాడని చెపుతారు. అప్పుడు మహేశ్వరుడు ఆ రాతిబండను వేరే ప్రక్కకు పదేట్లుగా చేసాడనీ, అది ఆలయ సమీపంలో రోడ్ మీద ఉన్నాడని చెపుతారు.



Click it and Unblock the Notifications