లక్ష ద్వీపాలలో వినోదానికి కవరత్తి ప్రధాన కేంద్రం గా వుంది. ఇండియా లోని కోచి పట్టణానికి 360 కి. మీ.ల దూరం లోను ఆగట్టి ద్వీపానికి 50 కి. మీ.ల దూరం లోను కలదు. ఇండియా నుండి బోటు లో లేదా ఆగట్టి నుండి హెలికాప్టర్ లో చేరవచ్చు. కరవట్టి లక్ష ద్వీప్ దీవుల సముదాయానికి హెడ్ క్వార్టర్స్ గా పని చేస్తుంది.
నీటి క్రీడలకు ప్రసిద్ధి గాంచిన కరవట్టి దీవి లో ప్రజలు సుమారు 10,000 మంది వుంటారు. షాపింగ్ ప్రదేశాలు, కొన్ని హెరి తేజ్ , మ్యూజియం, ప్రదేశాలు కలవు. మసీదులు కూడా కలవు. కరవట్టి బీచ్ లు వేలాది ప్రజలను ప్రతి సంవత్సరం అక్కడ కల చక్కని రెస్టారెంట్ లు షాక్ లు కారణం గా ఆకర్షిస్తాయి. ఈ ద్వీపం సుమారు 4.22 చ.కి. మీ.విస్తీర్ణం కలిగి అతి తక్కువ సమయం లో చూసేది గా వుంటుంది. రోడ్లు బాగుంటాయి. బైక్ లు అద్దెకు తీసి తిరగవచ్చు.
మీకు ఈత వచ్చినా, రాకున్నా సరే నీటిలో దిగి ఆనందిస్తారు. స్కూబా డైవింగ్ అందరికి అందుబాటు లో వుంటుంది. గాజు అడుగు గల మోఅట్ లు అద్దెకు తీసుకొని నీటి లో ప్రయాణిస్తూ, అందమైన జల చరాలను చూసి ఆనందించవచ్చు. ఇక్కడ డాల్ఫిన్ డైవ్ సెంటర్ లో నీటి ఆటలు ఆడవచ్చు.
లక్ష ద్వీప్ దీవుల లో ప్రధానంగా ముస్లిం జనాభా వుండటం చేత, ఇద్ ఉల్ ఫితర్ అట్టహాసంగా జరుపుకొంటారు. అక్టోబర్ నెల వచ్చిందంటే చాలు, 17 వ శతాబ్దపు ప్రసిద్ధ ఉజ్రా మాస్క్ లో వేడుకలు జరుగుతాయి. మరో దక్షిణ భారత దెస పండుగ అయిన ఓనం పండుగ ఈ దీవుల లో ఆగష్టు మరియు సెప్టెంబర్ ల లో జరుపుకొంటారు.
తెల్లని ఇసుక బీచ్ ప్రాంతాలు కల కరవట్టి దీవి ప్రతి సంవత్సరం వేలాది పర్యాటకులను విహారం కొరకు ఆకర్షిస్తోంది. అందమైన, పచ్చని నీరు, ప్రశాంత బీచ్ వాతావరణం అక్కడకు చేరిన ప్రతి ఒక్కరిని ఆనందింప చేస్తున్నాయి.