ఆగట్టి ద్వీపాన్ని లక్షద్వీప దీవుల గేటు వే గా పిలుస్తారు. భారత దేశం నుండి వెళ్ళే ప్రయాణికులు విమానం లేదా నౌకా ప్రయాణం ఏదైనప్పటికీ తప్పక ఈ ప్రాంతం చేరాల్సిందే. ఇక్కడ కల విమానాశ్రయం కు కోచి మరియు బెంగుళూరు ల నుండి నేరు విమానాలు కలవు. ఆగట్టి దీవి విస్తీర్ణం సుమారు నాలుగు చ. కి. మీ. ల కంటే కొంచెం తక్కువే. ఇక్కడ రెండు రిసార్ట్ లు కలవు. ఒక సన్నని రోడ్డు మార్గం మీకు ద్వీపం అంతా చూపుతుంది. కనుక ఒక మంచి మోటార్ బైక్ పై ప్రయాణించటం మేలు.
కాలి నడకన సైతం ఈ దీవి లో తిరిగినా ఎక్కువ సమయం పట్టదు. అద్భుత ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు. అంతర్జాతీయ పర్యాటక రంగంలో ఆగట్టి మరియు లక్షద్వీప్ లు కొత్తగా చేరాయి. ఈ దీవులలో ఏ మాత్రం వాణిజ్య పర అంశాలు కనపడవు.
తెల్లని బీచ్ ఇసుక , నిర్మలమైన నీరు కల నీలి సముద్ర భాగం మీకు అచ్చెరువు కలిగిస్తాయి. చాలా మంది టూరిస్టులు, ఇండియా ప్రధాన భూభాగం నుండి వెళ్ళిన వారు ఆగట్టి సమీపించే సరికి అసలు ఏమి చూస్తున్నామనే దానికి ఆశ్చర్య పోతారు. 200 కి. మీ.ల దూర ప్రయాణం లో మీకు అంత మార్పు కనిపిస్తుంది.
ఆగట్టి దీవిలో స్కూబా డైవింగ్ మరియు స్నోర్కేలింగ్ వంటి నీటి క్రీడలు టూరిస్టులు ఆచరించవచ్చు. వీటి ఖర్చు కూడా తక్కువే. ఫిషింగ్ కూడా కలదు. అయితే, మీరు ఫిషింగ్ కు వెళ్ళేటపుడు, బోటు అడుగున గ్లాస్ ఉండేలా చూసుకోండి. ఆ గ్లాస్ నుండి అందమైన నీటి లోని నాచు ఇతర జీవాలు చూడవచ్చు. పర్యాటక ఏర్పాట్లు బాగానే వుంటాయి. మీరు కనుక చేపలు పట్టుకుంటే, వాటిని వేయించి మీకు తినిపిస్తారు కూడాను. మీరు అక్కడ దొరికే స్థానిక ఆహారాలు కూడా రుచి చూడవచ్చు.
ఈ ప్రదేశం లో దొరికే టూనా చేప ప్రపంచ ప్రసిద్ధి. స్థానిక వంటకాలు రుచికరంగా వుంటాయి. ఐటెం, ద్వీపం లో అన్ని చోట్లా ఆల్కహాల్ తాగే అవకాశం వుండదు. ఆగట్టి నుండి, లక్ష ద్వీపాలలో మరో ఆకర్షణీయ ప్రదేశం బంగారం కూడా చేరవచ్చు. ఈ దేవి లో మీకు ఆల్కహాల్ బాగా దొరుకుతుంది.