రాజమాచి వన్యప్రాణుల అభయారణ్యానికి చుట్టూ అన్ని వైపులా పచ్చని దట్టమైన అడవులు ఉన్నాయి. ఇది అందమైన లోనావాలాలో ఏర్పాటయింది. ఈ అభయారణ్యం సహ్యాద్రి శ్రేణుల పశ్చిమ పర్వత ప్రాంతాలలో నెలకొని, వన్యప్రాణులకు ఆవాసమైంది. ప్రకృతిని ప్రేమించే పర్యాటకులు ఇక్కడి అడవి జంతువులు వాటి సహజ నివాస పరిసరాల్లో స్వేచ్చగా తిరగటం చూసి సంబరపడతారు.పెద్దగా వుండే భారతీయ ఉడుతలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ భూభాగం అరుదైన వన మూలికల, మొక్కల సంపద కలిగిఉంది. క్లుప్తంగా, ఇది ప్రకృతిలో వ్యాహ్యాళికి, పర్వతారోహణకి, పక్షులను చూడటానికి ఒక అనువైన ప్రదేశం.