హార్స్లే హిల్స్ ఆంధ్రప్రదేశ్ లో మదనపల్లె పట్టణం సమీపంలో ఉన్న చాలా ప్రజాదరణ పొందిన వేసవి హిల్ రిసార్ట్.ఈ రిసార్ట్ కు బెంగుళూర్, హైదరాబాద్ మరియు తిరుపతి వంటి దక్షిణ ప్రధాన నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు. ఏప్రిల్ మరియు మే నెలల్లో వేడి పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ సుందరమైన పర్వతం వేడి వాతావరణం నుంచి బాగా అవసరమైన ఉపశమనం ను కలిగిస్తుంది.
ఈ కొండలను ఇంతకు ముందు ఏనుగు మల్లమ్మ కొండ అని పిలిచేవారు.ఆ ప్రదేశంలో మల్లమ్మ చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఏనుగులు సంరక్షించాయి,అందుకే ఏనుగు మల్లమ్మ కొండ అని పేరు వచ్చింది.మల్లమ్మ సమీపంలోని గిరిజన జాతులు మరియు రోగాల బారిన పడిన వ్యక్తుల కోసం శ్రద్ధ తీసుకునేది. ఆమె ఒక రోజు అకస్మాత్తుగా అదృశ్యమవడంతో గిరిజన ప్రజలు తన కోసం ఒక ఆలయం నిర్మించాలని నిర్ణయించారు.తర్వాత వేసవి విడిది కోసం వచ్చిన ఒక బ్రిటిష్ అధికారి, డబ్ల్యూడి హార్స్లే ఈ హిల్ స్టేషన్ లో రెండు ఇళ్ళు, కరాచీ రూమ్ మరియు పాల బంగళా నిర్మించడం ద్వారా అయన పేరుతొ పిలవబడుతుంది.