అస్సాంలోని మజులిలో ఒక ద్వీపం దఖినపాట్ సత్రం ప్రసిద్ధ సామాజిక-ధార్మిక సంస్థలలో ఒకటి. ఇది వంశీగోపాల్ అనే శిష్యునిచే స్థాపించబడింది. అహోం వంశస్థులు పోషించిన అనేక రకాల సాంస్కృతిక శిల్పాలు, చిత్రాలు, నృత్యాలు ప్రదర్శించే కళా సంస్కృతికి ఇది ముఖ్య కేంద్రం. శ్రీ శంకరదేవ అందించిన అనేక వేర్వేరు రకాల నృత్యాలను అందించడం వలన నృత్యనిలయం అని కూడా పిలుస్తారు.
దీనిని 1584 వ సంవత్సరంలో స్థాపించారు. సత్రం ద్వారమార్గం మత కళలు, పూలు, జంతువుల చెక్కిన చిత్రాలతో అలంకరించబడి ఉంటుంది. అస్సాం లోని ప్రసిద్ధ జాతీయ పండుగ రాసలీలను ప్రతి ఏట సత్రంచే నిర్వహించబడుతుంది. సత్రాల స్థాపకుడు బన్మలిదేవ్ రాసలీలలకు మద్దతుదారుడు. సత్రాలలో నివసించే సాధువులను భక్తాలు అంటారు.
ప్రస్తుతం అటువంటి భక్తాలు తొంభై నుండి వంద దాక ఉన్నారు. ఈ సంస్థ సత్రాధికార్ పర్యవేక్షణలో ఉంది. శ్రీమంత శంకరదేవుని అవశేషాలు, లిఖిత ప్రతులను సత్రాధికార్ సంరక్షిస్తున్నారు. ఈ సత్రాలు మహాపురుక్సియ ధర్మాన్ని అనుసరిస్తాయి. ఈ సత్రాలలో జాదవరాయ మహాప్రభు విగ్రహాన్ని పూజిస్తారు.