ద్వీపం అనేక లక్షణాలు – మజులి లోనూ, చుట్టూ ఉన్నపర్యాటక ప్రదేశాలు ప్రపంచంలోనే అతి పెద్ద నదీ ద్వీపంగా మజులి ఒక గౌరవమైన గుర్తింపును కల్గిఉంది. వాస్తవానికి ఈ ద్వీపం 1250 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నప్పటికీ భూమి కోత కారణంగా దాని పరిమాణం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం దాని పూర్తి వైశాల్యం 421.65 చదరపు కిలోమీటర్లు మాత్రమే. జోర్హాట్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మజులిని ఫెర్రీల ద్వారా చేరవచ్చు.
మజులి లో జీవితమంతా వేడుకలమయంగా మాత్రమే ఉంటుంది. ఎడతెరిపిలేని వరదలు, పర్యావరణ క్షయంల మధ్య ఏదీ బ్రతికిస్తుంది అంటే జీవించాలనే స్ఫూర్తే.
ఇవాళ మనం చూసే మజులిని తయారు చేసింది సంస్కృతి, దార్మికతే. సత్రాలు లేదా సామాజిక-సాంస్కృతిక సంస్థలే ఈ నదీ ద్వీపానికి జీవం వంటివి. ఈ ద్వీపంలో చాలామందికి సన్యాసీమఠాలు, వారసత్వాలుగా పనిచేసే
సత్రాలు సుమారు 25 ఉన్నాయి. ఇవి పర్యాటకులకు ఆసక్తికరంగా ఉంటాయి.
మొట్టమొదటి సారిగా అస్సాం ప్రసిద్ధ సాధువు శ్రీమంత శంకరదేవచే తర్వాత అతని శిష్యుడు మాధవదేవ్ చే ప్రచారం చేయబడిన ఈ సత్రాలను నవీన – వైష్ణవమత సంస్కృతికి కేంద్రాలుగా పరిగణిస్తారు. ఇక్కడ, వైష్ణవమతాన్ని బోధించి, ప్రచారం చేయడమే కాక, ఇవి భారతదేశ ప్రధాన శాస్త్రీయ నృత్య కృత్యం – సత్రియా నృత్యానికి కూడా నివాసం. సత్రాలు ( క్సత్రాలు గా అస్సాం భాషలో పలికే) అస్సాం లోని మొదటి ధార్మిక గురువు శ్రీమంత శంకర దేవుని నవీన – వైష్ణవమత ప్రవచనాలకు కట్టుబడిన సామాజిక-సాంస్కృతిక సంస్థలు.
ఈ సత్రాలు లేకుండా మజులి పర్యాటక రంగం పూర్తి కాదు. ప్రతి సత్రం కొన్ని వేర్వేరు బోధనలను చేస్తూ ఉన్నప్పటికీ ఆ కొంచం అస్సాం సంస్కృతి, సంప్రదాయానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. దాని విశిష్టమైన లక్షణాన్ని కల్గిఉంది. మజులిలోని కమలబరి సత్రం ఎంతో ప్రభావవంతమైన, ప్రసిద్ధి చెందిన సత్రాలలో ఒకటి అయితే, అనియతి సత్రం పాలనం పండుగకు, అప్సర నృత్యానికి ప్రసిద్ది చెందింది. బెంగానాతి సత్రం, శామగురి సత్రం మజులిలోని ముఖ్యమైన రెండు ఇతర సత్రాలు.
మజూలి చేరడం ఎలా
నదీద్వీపం అయినందున మజూలి చేరడానికి ఒకే ఒక్క దారి బ్రహ్మపుత్ర నది మీదుగా ఫెర్రీల ద్వారానే. జోర్హాట్ లోని నిమతి ఘాట్ ద్వారా ఫెర్రీ సేవలు అందుబాటులో ఉంటాయి.
మజులి లో వాతావరణ౦
మజూలి లో వాతావరణం సుదీర్ఘ వర్షాకాలంతో చాలా కఠిన౦గా ఉంటుంది. వేసవికాలం వేడిగా, తేమతో కూడి ఉండగా, శీతాకాలాలు పరిగణించదగిన చల్లదనంతో మజులి పర్యాటకరంగానికి అనుకూలంగా ఉంటాయి.