మండి జిల్లాలో ఉన్న తర్నా హిల్ పై ఉన్న తర్నా ఆలయం ఇక్కడున్న మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణ. హిందూ దేవత అయిన పార్వతీ దేవి అవతారం అయిన శ్యామ కాళీ దేవత కి అంకితమివ్వబడిన ఆలయం. ఈ ఆలయం 17 వ శతాబ్దం లో శ్యాం సేన్ రాజు చేత నిర్మించబడింది. శ్యామ కాళీ ఆలయం గా ప్రాచుర్యం పొందిన ఈ ఆలయం మెయిన్ బజార్ నుండి 305 మెట్ల ద్వారా చేరుకోవచ్చు. హిందూ దేవతల మరియు గురువుల అందమైన చిత్రలేఖనాలు ఈ ఆలయం లో ప్రదర్శించారు.