కులు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1433 మీటర్ల ఎత్తున నెలకొని వుంది రైసన్. బియాస్ నది ఒడ్డున కొన్ని చిన్న చిన్న గ్రామాలతో ఏర్పడిన రైసన్ తేట నీటి మీద రాఫ్టింగ్ కి, క్యాంపింగ్ చేసే ప్రదేశాలకి ప్రసిద్ది. అసంఖ్యాకమైన యాపిల్ తోటలు, రేగు, నేరేడు తోటలు ప్రకృతిని మరింత రమణీయంగా మారుస్తాయి. శీతాకాలం చివరికి, మార్చ్ నెలలో ఈ ప్రాంతం అంతా కొత్తగా పుష్పించే పూలతో వర్ణమయంగా మారిపోతుంది.
ప్రతి ఏటా వేసవి లో జరిగే రాజేంద్ర ప్రసాద్ నేషనల్ ఆప్తాల్మాలజీ సెంటర్ వారి చికిత్సా శిబిరం ఈ ప్రాంతపు ప్రధాన ఆకర్షణ. ఈ శిబిరంలో అనేక నేత్ర వ్యాధులకు చికిత్స చేస్తారు. రైసన్ లోని రఘునాథ్ దేవాలయం హిందువుల పుణ్య క్షేత్రం. రాముడి పేరిట నిర్మించిన ఈ దేవాలయం ఏడాది పొడవునా ఎంతో మంది యాత్రికులను ఆకర్షిస్తుంది.
రైసన్ లో చూసి తీరాల్సిన మరో దేవాలయం జగన్నాది దేవాలయం. కులు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని బెఖీ అనే గ్రామంలో వుండే ఈ దేవాలయం అత్యద్భుత నిర్మాణ కౌశలం తో నిర్మించబడింది. కులు, మనాలి, గుషైని, నగ్గర్, భు౦టార్, మణికరణ్, పాలంపూర్ ఇక్కడికి దగ్గరలోని కొన్ని ఇతర పర్యాటక ప్రదేశాలు.
రైసన్ వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. రైసన్ లో రైల్వే స్టేషన్ గానీ విమానాశ్రయం గానీ లేకపోయినప్పటికీ, దగ్గరలోని విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్ దాకా వెళ్లి, అక్కడినుంచి రైసన్ చేరుకోవచ్చు. కులు లో వున్నది ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయం. అక్కడి నుంచి టాక్సీల ద్వారా ప్రయాణీకులు ఇక్కడికి తేలిగ్గానే చేరుకోవచ్చు. రోడ్డు ద్వారా రావాలంటే 21 కిలోమీటర్ల దగ్గర లోని కులు గుండా రావచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు రెండిటిలోనూ ఇక్కడికి చేరుకోవచ్చు.
రైసన్ లో ఏడాది పొడవునా వాతావరణం ఒక మాదిరిగానే వుంటుంది. వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రతలు 25 నుంచి 35 డిగ్రీల మధ్య వుంటాయి. వర్షాకాలంలో ఒక మోస్తరు వర్షాలు పడతాయి. కనుక యాత్రికులు ఈ కాలంలో కూడా ఇక్కడికి రావచ్చు. శీతాకలాల్లో ఇక్కడి ఉష్ణోగ్రతలు 25 నుంచి 0 డిగ్రీల మధ్య వుంటాయి. చలి తీవ్రంగా వుంటుంది కనుక యాత్రికులు మంచి శీతాకాలం అప్పుడు ఇక్కడికి రాకుండా వుండడం మంచిది.