హిమాచల్ ప్రదేశ్ లోని విష్ణు కుండం వద్ద వున్న కులాంత పీఠం దేశంలోని అత్యుత్తమ పీఠాల్లో ఒకటి. జానపద గాధల ప్రకారం లయకారకుడు శివుడు ఇక్కడే నివసించాడు. అందువల్ల ఈ ప్రాంతం అనేకమంది యాత్రికులను ఆకర్షిస్తుంది.
భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే శక్తి గల పవిత్రమైన నీరు ఈ పీఠం లోని చెరువులో వున్నాయని నమ్ముతారు.
విష్ణు భక్తుడైన దేవర్షి నారదుడు శివుడి కళ్ళలోని శక్తి వల్ల భక్తులు క్రోధం నుంచి, దుర్గుణాల నుంచి విముక్తులు అవుతారని చెప్పాడు. ఇక్కడి వేడి నీటిలో ఆహారం వండుకుని తిన్న వారికి స్థితి కారకుడైన విష్ణు లోకం సంప్రాప్తిస్తుందని కూడా నమ్ముతారు.