నరకంద నుండి 17 కి.మీ.ల దూరంలో, సముద్ర మట్టం కి 1830 మీటర్ల ఎత్తులో ఉన్న కొత్గఢ్ మరియు తానేదార్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రములోని రెండు ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలు.సట్లెజ్ నది ఎడమ తీరంలో ఉన్న కొత్గఢ్, గుర్రపు డెక్క ఆకారపు పురాతన లోయకై ప్రసిద్ధి చెందగా, తానేదార్ ఆపిల్ తోటలకు పేరుగాంచింది.
సందర్శకులు కొత్గఢ్ లోయ నుండి, కులు లోయ మరియు మహోన్నత హిమాలయాల మంచు పర్వతాల యొక్క అద్భుతమైన దృశ్యాలు చూడగలరు. ప్రసిద్ధ రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్, తన 'లిస్పెత్' అనే కథానిక లో కొత్గఢ్ ని , "ఉత్తర కొండల దొరసాని" గా అభివర్ణించాడు.
ఈ రెండు ప్రదేశాలను, భారీ ఆపిల్ తోటలు మరియు పండ్లతోటల వల్ల, నరకంద యొక్క అత్యంత పచ్చని లోయలుగా భావిస్తారు. భారతీయ తత్వశాస్త్రం చేత బాగా ప్రభావితం కాబడిన అమెరికా జాతీయుడు శామ్యూల్ స్టోక్స్ 1904 లో భారతదేశం వచ్చి ప్రారంభించిన ప్రసిద్ధ స్టోక్స్ ఫారం కూడా ఇక్కడ తానేదార్ లోనే ఉంది. స్టోక్స్ ఫారం, రెడ్ డెలీషియస్ (ఎర్రటి సురుచి), గోల్డెన్ డెలీషియస్ (బంగారు సురుచి), రాయల్ డెలీషియస్ (రాచ సురుచి) వంటి ఆపిల్ రకాలు, వాటి తాజాదనం మరియు రుచి కోసం అంతర్జాతీయ మార్కెట్లో పేరు మోసాయి.