ప్రాగ్ పూర్, హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో సముద్రమట్టానికి 1800 అడుగుల ఎత్తున ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక స్థానం. ఈ ప్రదేశాన్ని 1997 లో హిమాచల ప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ గ్రామంగా ప్రకటించింది. గర్లి – ప్రాగ్ పూర్ జంట గ్రామాలను తర్వాత 2002 వ సంవత్సరంలో వారసత్వ ప్రాంతాలుగా ప్రకటించారు. ఇలా చేయడానికి కారణం ప్రాగ్ పూర్ లో చారిత్రిక, ధార్మిక ప్రాముఖ్యత ఉన్న అనేక ప్రాంతాలు ఉండటమే.
గ్రామ౦ నడిమధ్యలో ఉన్న తాల్ చెరువు చుట్టూ గ్రామమంతా నిర్మించబడి నట్టుగా కనిపించడం వలన ఇది ఈ ప్రాంత౦లోన ఒక ప్రధాన ఆకర్షణగా మారింది. తాల్ సమీపంలో ఉన్న వారసత్వ నిర్మాణాల్లో రాధాకృష్ణుల మందిరం, నేహర్ భవన్, నౌన్ ఉన్నాయి. 100 ఏళ్ళకు పైగా పురాతన నిర్మాణంగా తెలిపే భుతైల్ నివాస్ అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.
ప్రాగ్ పూర్ లోని మరొక ఆకర్షణ, భారత – ఐరోపా నిర్మాణ శైలిని కనబరిచే భవంతి జడ్జి కోర్టు. ప్రాగ్ పూర్ ప్రముఖ పర్యాటక స్థానాల జాబితాలో ధునిచాంద్ భార్దిలాల్ సరై కూడా చేరింది. ఇవేకాక, బజ్రేశ్వరి, జ్వాలాముఖి, చింత్పురి అనేకమంది సందర్శకులను ఆకర్షించే ఈ ప్రాంతంలోని ప్రసిద్ధి చెందిన కొన్ని ఆలయాలు.
దక్షిణార్ధ గోళం నుండి ఉత్తరార్ధగోళానికి సూర్యుని కదలికలను వేడుకగా జరుపుకొనే ఈ గ్రామంలోని ప్రసిద్ధ పండుగ లోహ్రి అనేక మంది పర్యాటకులను ప్రతి ఏటా ఆకర్షిస్తుంది. ప్రాగ్ పూర్ కు సెప్టెంబర్ నెలలో అనేక మంది సందర్శకులను రప్పించే మరొక పండుగ రెజ్లింగ్.
ప్రాగ్ పూర్ వాయు, రోడ్డు, రైలు మార్గాల ద్వారా సులువుగా చేరవచ్చు. ప్రాగ్పూర్ లో విమానాశ్రయం లేకపోవడం వలన ఇక్కడకు దగ్గరలోని షిమ్లా విమానాశ్రయం ద్వారా చేరవచ్చు. ఈ వారసత్వ గ్రామం నుండి షిమ్లా జుబ్బార్హట్టి విమానాశ్రయం 203 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కత వంటి భారత ప్రధాన నగరాలకు ఈ విమానాశ్రయం కలపబడింది.
ఇక్కడి నుండి పర్యాటకులకు టాక్సీలు, క్యాబ్లు అందుబాటులో ఉంటాయి. ప్రాగ్పూర్ కు దగ్గరగా 67 కిలోమీటర్ల దూరంలో ఉనాలో రైలు స్టేషన్ ఉంది. ఉనా రైలు స్టేషన్ నుండి భారత దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రధాన రైలు స్టేషన్లకు మార్గం ఉంది. రోడ్డు ద్వారా ప్రయాణించ దలచిన పర్యాటకులకు చండీగఢ్, పఠాన్ కోట్ నుండి బస్సులు సులువుగా అందుబాటులో ఉంటాయి. దీనితో బాటుగా, ప్రాగ్ పూర్ నుండి 173 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమృత్ సర్ నుండి కూడా బస్సులు అందుబాటులో ఉంటాయి.
ప్రాగ్ పూర్ లో ఏడాది పొడవునా సమశీతోష్ణ వాతావరణ స్థితి ఉంటుంది. వేసవిలో ప్రాగ్ పూర్ లో వాతావరణం ఇతర పరిసర ప్రాంతాలతో పోల్చినప్పుడు ఒక మోస్తరుగా ఉంటుంది. వేసవిలో ఈ ప్రాంత౦లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 32, 20 డిగ్రీల సెంటిగ్రేడ్లుగా ఉంటాయి. వర్షాకాలంలో ప్రాగ్ పూర్ లో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ ప్రాంతాన్ని ఈ కాలంలో సందర్శించే పర్యాటకులు వర్షాలకు తగిన దుస్తులతో వెళ్ళ వలసినదిగా సూచించ బడింది. ప్రాగ్పూర్ లో శీతాకాలం అక్టోబర్, ఫిబ్రవరి నెలల మధ్య ఉంటుంది. ఈ ప్రాంతంలో సాధారణ ఉష్ణోగ్రత 16 – 25 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉంటుంది. ఈ ప్రాంత పర్యటనకు ఉష్ణోగ్రత ఎంతో ఆహ్లాదకర౦గా ఉండే వేసవి, శీతాకాలాలు ఉత్తమమైనవి.