శ్రీ రంగనాయక దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరులో కలదు. ఈ దేవాలయంలో విష్ణు మూర్తిని రంగనాథుడుగా పూజిస్తారు. ఈ గుడిని తల్పగిరి రంగనాథస్వామి దేవాలయం లేదా రంగనాయకులు దేవాలయం అని కూడా అంటారు. ఈ దేవాలయాన్ని సుమారు క్రీ.శ. 12వ శతాబ్దంలో నిర్మించారు. ఇది పెన్నా నది ఒడ్డున కలదు.
ఈ ప్రదేశంపై అనేక పురాణ గాధలు కలవు. స్థానికుల మేరకు కాశ్యప మహర్షి ఇక్కడ పౌండరీక యాగాన్ని చేసాడని, దేముడు మహర్షి యాగానికి మెచ్చి ఆశీర్వదిన్చాడని చెపుతారు. దేవాలయ శిల్ప శైలి పల్లవుల శిల్ప శైలి కలిగి వుంటుంది. దీని గాలిగోపురం సుమారు 70 అడుగుల ఎత్తు కలిగి, 10 బంగారు పూత గల పాత్రలని పై భాగం లో కలిగి వుంటుంది. ఈ పాత్రలని కలసాలు అని అంటారు. నెల్లూరు లో ఈ గోపురం ఒక ప్రధాన ఆకర్షణ. నెల్లూరు చేరితే చాలు, మీరు ఇక్కడకు తేలికగా రావచ్చు.